Pratti Seshayya
Pratti Seshayya - Quiz
Pratti Seshayya – Quiz: సర్వోదయ సేవకునిగా, సత్యాగ్రాహిగా, అంధ్ర రాష్ట్ర ఏర్పాటు సమయంలో మంచి నాయకునిగా, విశాఖ ఉక్కు ఉద్యమంలోనూ ఆయన చేసిన కృషి ఎంతో ప్రాముఖ్యమైనది. తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ స్వాతంత్ర్యయోధులు, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమ నాయకుల సమకాలీకులు శేషయ్య(Pratti Seshayya).
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్రోద్యమకారుడు ప్రత్తి శేషయ్య(Pratti Seshayya). తాడేపల్లిగూడెం మండలంలోని మాధవరంగ్రామంలో జన్మించారు శేషయ్య.
తన 17వ ఏట క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో స్వాతంత్ర్యోద్యమంలోకి ప్రవేశించారు ఆయన. 2017 అక్టోబరు 27న తాడేపల్లిగూడెంలో ఆయన మరణించారు.
ఆయన జన్మించిన గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ గ్రామాన్ని మిలటరీ మాధవరం అని కూడా పిలుస్తారు. ఈ గ్రామంలోని ప్రతి ఇంటి నుంచీ కనీసం ఒక యువకుడైనా భారత సైన్యంలో చేరతారు.
ప్రపంచ యుద్ధాల కాలం నుండి ఇప్పటికీ ఈ ఊరిలో అదే జరుగుతూ వస్తోంది.శేషయ్య(Pratti Seshayya) తన 17వ ఏట దేశ పరిస్థితులను అనుసరించి, సైన్యంలో చేరడం కన్నా స్వాతంత్ర్యోద్యమంలోకి రావడమే ఉత్తమంగా నిర్ణయించుకున్నారు.
1942 ఆగస్టు 17న బేతిరెడ్డి సత్యనారాయణరెడ్డి నాయకత్వంలో పెంటపాడులో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా సహ విద్యార్థులు వరదా బ్రహ్మానందం, మెండు నరసింహారావు, మందలపర్తి సారంగపాణి, చిలుకూరి వీరభద్రయ్యలతో కలసి పోస్టాఫీసు ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు.
More About : Pratti Seshayya
ప్రత్తి శేషయ్య క్విజ్
Also Read : సంగం లక్ష్మీబాయి